Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వ్యభిచార కేసులో ముమైత్ ఖాన్ చిత్ర నిర్మాత
వ్యభిచారం కేసులో అరెస్టయిన జ్యోతి, సైరాభానులనుతో పాటు ఓ సిని నిర్మాత కూడా కేసులో ఇరుక్కున్నారు. ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నది 'ఎల్ బోర్డ్", 'జాదూగాళ్లు" వంటి చిత్రాలను నిర్మించిన జువ్వలరాజు. రాజమండ్రికి చెందిన జువ్వలరాజు నిర్మాతగా ఓ వెలగు వెలగాలనే హైదరాబాద్ వచ్చారు. అందిన చోటల్లా అప్పులు చేసి ముమైత్ ఖాన్ ప్రధానపాత్రలో చేసిన 'ఎల్ బోర్డ్", 'జాదూగాళ్లు" చిత్రాలను కన్నడ, హిందీలనుంచి తెలుగులో కి అనువదించారు. అవి రెండూ తీవ్ర నష్టాన్ని ఇచ్చాయి. దాంతో ఆర్ధికంగా నష్టపోయిన తాను ఇంటికి వెళ్ళలేక..మరో చిత్రం జోలికి వెళ్ళలేక రవిచందు, వీరన్నలతో కలిసి వ్యభిచార కేంద్రం ప్రారంభించాడు. కుందన్ బాగ్ సమీపంలోని ఉమానగర్ లో నెలకు ముప్ఫై వేల అద్దెకు త్రీ బెడ్ రూమ్ ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. డిల్లీలో ఉన్న ప్రధాన ఏజెంట్ల సహకారంతో విదేశీ అమ్మాయిలను, స్ధానికంగా ఉండే వర్ధమాన తారలతో ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఇక రవిచంద్..గత ఐదేళ్ళుగా సినీ ఆర్టిస్టు కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. వర్ధమాన తారలను వ్యభిచారంలోకి దింపి వారిని జువ్వలరాజు కోరినప్పుడల్లా పంపేవాడు. ఒక్కో రాత్రికి రెండు లక్షలు దాకా వసూలు చేసి తాను ముప్పై పర్శంట్ కమీషన్ తీసుకునేవాడు. అలాగే వీరన్న సినీ కాస్ట్యూమర్ గా పనిచేసి ఈ వ్యాపారం లోకి వచ్చాడు. అతను పాతిక పర్సంట్ కమీషన్ తీసుకునేవాడు.