Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్యపై నమ్మకం... తండ్రిని దూరం పెడుతున్న లక్ష్మి!
మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి ప్రసన్న ప్రస్తుతం 'ఊ కొడతారా ఉలక్కి పడతారా' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెత్ తో రూపొందుతున్న ఈచిత్రంలో నందమూరి నటసింహం బాలయ్య ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రూ. 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. లక్ష్మి అంత ఖర్చు పెట్టి సెట్ వేసి సాహసం చేస్తుండటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అయితే బాలయ్య క్యారెక్టర్ గురించే ఆ సెట్ వేశారట. ఇందులో ఆయన జమిందార్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఇటీవల ఈ చిత్రం లోగో విడుదలైంది. అందులో గాంధర్వ మహల్ కు సంబంధించిన సెట్ కూడా దర్శనం ఇస్తోంది. ఈ టైటిల్ ఆవిష్కరణ సందర్భంగా దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావుతో పాటు మంచు ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అలాంటి బ్యాగ్రౌండ్ తో సినిమా నిర్మిస్తున్న ఆమె అభిరుచిని అంతా మెచ్చుకున్నారు.
అయితే మంచు లక్ష్మి నమ్మకం అంతా సినిమా కథ, స్ర్కిప్టుపైనే నంట. అందులో అంత దమ్ముంది కాబట్టే ఖర్చుకు వెనకాడటం లేదంటున్నారు. అదే విధంగా బాలయ్య ఇమేజ్ ఈ చిత్రాన్ని ఓ రేంజికి తీసుకెలుతుందని భావిస్తుందట. మోహన్ బాబు కుమార్తెగా కాకుండా తనకు తాగాను క్రెడిట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న లక్ష్మి...తండ్రి మోహన్ బాబును ఈ షూటింగుకు కావాలని దూరం పెడుతుందట.
ఉకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావస్తోంది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ జమిందార్ నరసింహ రాయుడుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. మంచు లక్ష్మి ప్రసన్న మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చితానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శేఖర్ రాజ. బెబో శశి సంగీతం అందిస్తున్నారు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.