Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఎన్టీఆర్ కథతో లక్ష్మీపార్వతి చిత్రం!?
రాయాలే గానీ ప్రతి జీవితమూ ఒక కథే..ఆ కథలో ఎన్నో మలుపులుంటాయి. భిక్షగాడి కథ నుండి బిల్ గేట్స్ కథ వరకూ ఓన్నో ఆసక్తికర సన్నివేశాలతో ఎన్నో కథలుంటాయి అంటుంది దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు భార్య లక్ష్మీ పార్వతి. ప్రస్తుతం ఆమె పెట్టిన 'అన్న తెలుగుదేశం" పార్టీ అటకెక్కడంతో సినిమా కథలు రాస్తూ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నానంటుంది. అందుకోసం ఆమె స్వయంగా ఎన్ టి ఆర్ జీవిత చరిత్రతో ఒక కథను తయారు చేస్తుందని సమాచారం.
ఎన్టీఆర్ జీవితంలో ఆఖరి మలుపుకు కారణమైన ఈమె ప్రస్తుతం రాస్తున్న కథకు క్లైమాక్స్ ఇచ్చిన తీరు ఎంతో ఆసక్తికరంగా వుంటుందని సమాచారం. ఎమ్.ఎ తెలుగు చదివి, హరికథలు నేర్చుకుంటూ 'అన్న"తెలుగుదేశం పట్ల ఆకర్షితురాలై ఎన్టీఆర్ ను వివాహమాడి చివరి పరిస్థితుల్లో అండగా నిలిచిన పార్వతి, నిర్మాత, దర్శకురాలిగా పరిచయం కానుంది. అన్నతో జీవితం ఏటూ లేదు. రాజకీయాలు కలిసిరాలేదు. ఇప్పుడు సినిమాల వైపు అడుగు ఏం జరుగుతుందో చూడాలి?.