Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోదావరి లక్ష్మీ ప్రసన్నని గట్టెక్కిస్తుందా?
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో 'గుండెల్లో గోదావరి'పేరుతొ ఓ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేసుకున్నాడు.1986 వచ్చిన దివిసీమ ఉప్పెన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రాన్ని లక్ష్మి ప్రసన్న స్వయంగా నిర్మిచనుంది కూడా.అలాగే ఈ చిత్రంలో ఆ ఉప్పెన వచ్చినప్పుడు మనుష్యులు ఎలా ప్రవర్తిస్తారు..మానవతా విలువలు ఏమౌతాయి...భాంధవ్యాలు ఎలా మారిపోతాయి అన్న విషయాలు చర్చించనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఈ సబ్జెక్టుపై ఆమె చాలా ప్రేమను పెంచుకుందని,గత కొంత కాలంగా ఇదే పాయింట్ పై ఆమె వర్క్ చేయిస్తోందని అంటున్నారు.అలాగే కథ మొత్తం ఒక రోజులోనే జరగనుందిట.ఆ ఉప్పెనకు చెందిన సెట్ ను వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.ఇక ఇప్పటికే 'అనగనగా ఓ ధీరుడు',దొంగలముఠా చిత్రాల్లో చేసింది.అవి రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.అలాగే ఆమె నిర్మించిన ఝుమ్మందినాదం చిత్రం కూడా ఫెయిలయింది.దాంతో ఈ కొత్త చిత్రం పరిస్దితి ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.తన నటనతో ఈ చిత్రాన్ని నిలబెడుతుందా లేక డబ్బుని గోదావరి పాలు చేస్తుందా అనేది ఆమె ముందున్న సవాల్.