twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోదావరి లక్ష్మీ ప్రసన్నని గట్టెక్కిస్తుందా?

    By Srikanya
    |

    మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో 'గుండెల్లో గోదావరి'పేరుతొ ఓ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేసుకున్నాడు.1986 వచ్చిన దివిసీమ ఉప్పెన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రాన్ని లక్ష్మి ప్రసన్న స్వయంగా నిర్మిచనుంది కూడా.అలాగే ఈ చిత్రంలో ఆ ఉప్పెన వచ్చినప్పుడు మనుష్యులు ఎలా ప్రవర్తిస్తారు..మానవతా విలువలు ఏమౌతాయి...భాంధవ్యాలు ఎలా మారిపోతాయి అన్న విషయాలు చర్చించనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    ఈ సబ్జెక్టుపై ఆమె చాలా ప్రేమను పెంచుకుందని,గత కొంత కాలంగా ఇదే పాయింట్ పై ఆమె వర్క్ చేయిస్తోందని అంటున్నారు.అలాగే కథ మొత్తం ఒక రోజులోనే జరగనుందిట.ఆ ఉప్పెనకు చెందిన సెట్ ను వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.ఇక ఇప్పటికే 'అనగనగా ఓ ధీరుడు',దొంగలముఠా చిత్రాల్లో చేసింది.అవి రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.అలాగే ఆమె నిర్మించిన ఝుమ్మందినాదం చిత్రం కూడా ఫెయిలయింది.దాంతో ఈ కొత్త చిత్రం పరిస్దితి ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.తన నటనతో ఈ చిత్రాన్ని నిలబెడుతుందా లేక డబ్బుని గోదావరి పాలు చేస్తుందా అనేది ఆమె ముందున్న సవాల్.

    English summary
    Lakshmi Prasanna is presently concentrating on her forthcoming film ‘Gundello Godavari’. She is raving about her film as the film is being made with a novel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X