Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
మెగా ప్రాజెక్ట్ పై కన్నేసిన రష్మీక మందన్న.. కానీ చరణ్ చూపు అమె వైపే?
మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన చిత్రం ఆచార్య. ఫెయిల్యూర్స్ లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు గాని అభిమానుల్లో మాత్రం అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయ్యింది. ఇక నవంబర్ లో పరిస్థితిని బట్టి సినిమాను మిగతా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నారు.
ఇక ఈ సినిమా మొదలయినప్పటి నుంచి కూడా ఒక విషయంలో చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. ఇంతకు సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుందనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఏ మాత్రం క్లారిటీ రాలేదు. మెగాస్టార్ ఆచార్య టైటిల్ ముందే తెలియకుండా ఎనౌన్స్ చేశారు. కానీ మిగతా విషయాలు మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇక రామ్ చరణ్ కి జోడిగా ఆ మధ్య చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఫైనల్ గా కీయరా అద్వానీ ఫిక్స్ అయ్యిందని టాక్ రాగా దర్శకుడు రష్మీక మందన్నను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే వినయ విధేయ రామతో డిజాస్టర్ చూసింది కాబట్టి కీయరాకు ఆచార్యలో అవకాశం ఇవ్వాలని చరణ్ ఆమెపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు టాక్. ఇక సినిమా షూటింగ్ నవంబర్ తరువాత కాబట్టి ఇంకా ఇద్దరు కూడా ఫైనల్ నిర్ణయానికి రాలేదట. ఇక ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే...