Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా ప్రాజెక్ట్ పై కన్నేసిన రష్మీక మందన్న.. కానీ చరణ్ చూపు అమె వైపే?
మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన చిత్రం ఆచార్య. ఫెయిల్యూర్స్ లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు గాని అభిమానుల్లో మాత్రం అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయ్యింది. ఇక నవంబర్ లో పరిస్థితిని బట్టి సినిమాను మిగతా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నారు.
ఇక ఈ సినిమా మొదలయినప్పటి నుంచి కూడా ఒక విషయంలో చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. ఇంతకు సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుందనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఏ మాత్రం క్లారిటీ రాలేదు. మెగాస్టార్ ఆచార్య టైటిల్ ముందే తెలియకుండా ఎనౌన్స్ చేశారు. కానీ మిగతా విషయాలు మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇక రామ్ చరణ్ కి జోడిగా ఆ మధ్య చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఫైనల్ గా కీయరా అద్వానీ ఫిక్స్ అయ్యిందని టాక్ రాగా దర్శకుడు రష్మీక మందన్నను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే వినయ విధేయ రామతో డిజాస్టర్ చూసింది కాబట్టి కీయరాకు ఆచార్యలో అవకాశం ఇవ్వాలని చరణ్ ఆమెపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు టాక్. ఇక సినిమా షూటింగ్ నవంబర్ తరువాత కాబట్టి ఇంకా ఇద్దరు కూడా ఫైనల్ నిర్ణయానికి రాలేదట. ఇక ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే...