Don't Miss!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మహేష్ సినిమాను లాగేసుకున్న దిల్ రాజు.. మెగా హీరోతో డీల్ క్యాన్సిల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర స్టార్ హీరోలతో ఎంత క్లోజ్ గా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బయట హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలని ఒక ప్లాన్ వేసుకున్న విషయం తెలిసిందే. అయితే మెగా హీరోతో దాదాపు ఫిక్స్ అయిన ప్రాజెక్టు చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యిందట. అందుకు కారణం దిల్ రాజు అని ప్రస్తుతం మీడియాలో ఒక టాక్ వైరల్ అవుతోంది.
బయట హీరోలతో కూడా..
మహేష్ బాబు సొంతంగా GMB ప్రొడక్షన్ ని స్థాపించిన విషయం తెలిసిందే. మహేష్ తన ప్రతి సినిమాకు ఈ సంస్థను కూడా ప్రొడక్షన్ హౌజ్ లతో కలుపుతూ ఉంటాడు. వచ్చిన లాభాల్లో షేర్స్ అందుకోవడానికి ఈ ఐడియా బాగా ఉపయోగపడుతోంది. ఇక సొంతంగా కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని..
ఇప్పటికే ఆడివి శేష్ తో మేజర్ అనే సినిమాను నిర్మిస్తున్న మహేష్ బయట హీరోలతో మరికొన్ని ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ తో కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తాను చేయాలని అనుకున్న సినిమాను మహేష్, చరణ్ కి షిఫ్ట్ చేశాడని టాక్ వచ్చింది.
మహేష్ వేసిన ప్లాన్..
కథ తనకు ఏ మాత్రం సెట్టవ్వదని దర్శకుడికి చెప్పడంతో దర్శకుడు అదే కథను మెగా పవర్ స్టార్ కి వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే మహేష్ వేసిన ప్లాన్ కాస్త తారుమరయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాను దిల్ రాజు వద్దకు వెళ్లిందట. రామ్ చరణ్ తో కొణిదెల ప్రొడక్షన్ ని కలుపుకొని దిల్ రాజు ఈ కొత్త ప్రాజెక్టును నిర్మించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Recommended Video
తొందరగా ఫినిష్ చేయాలని..
త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక RRR తరువాత రామ్ చరణ్ వంశీ పైడిపల్లి ప్రాజెక్టును చాలా తొందరగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఎందుకంటే ఆ సినిమా తరువాత వెంటనే మరో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేయాలని కొన్ని కథలను స్పెషల్ గా సిద్ధం చేయించుకుంటున్నట్లు సమాచారం.