Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిత్రంలో అల్లు అర్జున్,కాజల్ లవ్ స్టోరీ హైలెట్ ?
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్య 2 చిత్రంలో ఈ జంట రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఈ జంట మద్య లవ్ స్టోరీని బాగా పండించటానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ పదిహేను నిముషాలు పాటు ఉంటుందని అంటున్నారు. ఓ పాట, రెండు ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆ లవ్ స్టోరీ చాలా స్పీట్ గా నడిపి కథకు కీలకంగా మార్చనున్నారని తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకునే సినిమా మొత్తం నడుస్తుందంటున్నారు. తన కెరీర్ మలుపు కారణమైన 'మగధీర'ను గుర్తుచేసుకుంటూ ఆమె 'ఎవడు' చిత్రంలోని పాత్రకు అంగీకరించిందని చెప్పుకుంటున్నారు.
కాగా ఈ చిత్రంలో రామ్చరణ్ సరసన సమంత, అమీజాక్సన్ నాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తంమీద పలువురు ప్రముఖ తారల సమ్మేళనం కారణంగా 'ఎవడు' చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. అవును.. కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకు పెయిర్ గా కనిపించనుంది. ఆమె సీన్స్ సినిమాకు కీలకమై నిలుస్తాయి అన్నారు.
ఈ చిత్రం ఏప్రియల్ 5,2013న విడుదల చేయటానికి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజునే ఎంపిక చేయటానికి కారణం దిల్ రాజు ప్రారంభ రోజుల్లో నిర్మించిన దిల్ విడుదలైన రోజు అది. నితిన్ హీరోగా చేసిన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాంతో సెంటిమెంట్ గా ఆ రోజు అయితే బావుంటుందని నిర్ణంయించినట్లు సమాచారం. కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో పాల్గొంటూ వస్తున్నాడు. అల్లు అర్జున్,రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. పూర్తి స్ధాయి ఏక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.