Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆరున్నర కోట్లతో మంచు లక్ష్మీ ప్రసన్న సెట్
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న తాజాగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె భారీగా ఖర్చుపెడుతున్నారు. ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఆమె హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఓ సెట్ ను నిర్మిస్తున్నారు. బరోడా లోని లక్ష్మి విలాస్ ని పోలినట్లు ఈ సెట్ డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె చెన్నై నుంచి భూపేష్ అనే సెట్ డిజైనర్ ని రప్పించి,దాదాపు తొమ్మిది నెలల పాటు ఈ సెట్ ని నిర్మించారు. మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం బాలకృష్ణ రాజమండ్రి వెళ్ళారు. నరసాపురం దగ్గరలో ఉన్న అంతర్వేదిలో ఈ చిత్రం షూటింగ్ జరగుతోంది. అక్కడ గోదావరి నదీ ప్రాంతాన షూటింగ్ చేస్తున్నారు.
ఈ విషయం లక్ష్మీ ప్రసన్న వివరిస్తూ... అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవస్ధానం వద్ద జరిగే షూటింగ్ లో బాలకృష్ణ నాలుగు రోజులు పాల్గొంటారు. ఆయన పాత్ర సినిమాకు హైలెట్ కానుంది అని చెప్పారామె. ఈ చిత్రం 2012 వేసవిలో రిలీజ్ కానుంది. బేబో శశి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇక సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణ పాత్ర కీలకమై నిలుస్తుందని వినపడుతోంది. మోహన్ బాబుకీ, బాలయ్యకీ ఉన్న అనుబంధంతో ఈ చిత్రంలో చేయటానికి కమిటయ్యాడని చెప్పుకుంటున్నారు. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు రూపొందనుందని చెప్తున్నారు. ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న.. తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది.
ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ.. కృష్ణవంశీ దగ్గర అసోసియేట్గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా' అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.