Don't Miss!
- News మీ సేవలు చాలు ఇక- `అప్ప`ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఎన్టీఆర్ అయినా ఆమెకు బ్రేక్ ఇస్తాడా?
హైదరాబాద్ : అజయ్ తో ఆ ఒక్కడే చిత్రం చేసిన మధురిమ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆమె సరదాగా కాసేపు అంటూ వంశీ దర్శకత్వంలో చిత్రం చేసినా బ్రేక్ రాలేదు. కొత్త జంటతో ఐటం చేసినా గుర్తింపు రాలేదు. ఈ స్ధితిలో ఉన్నామెకు పూరి జగన్నాథ్ ద్వారా బ్రేక్ వచ్చే పరిస్ధితి కనపడుతోంది. ఆమెను ఎన్టీఆర్ తో తాను తీయబోతున్న చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా ఎపింక చేసారు. ఈ విషయాన్ని ఆమె ఖరారు చేసింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మించే చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దర్శకుడు పూరి జగన్నాథ్ నూతన కార్యాలయం 'కేవ్'లో ఈ చిత్రం ప్రారంభం కావడం అంతటా ఆసక్తిని రేపింది. ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా కాజల్ చేస్తోంది.
బండ్ల గణేశ్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్తో 'బాద్ షా' సూపర్హిట్ తరువాత చేస్తున్న సినిమా ఇది. అలాగే పూరి జగన్నాథ్తో కూడా మా బేనరులో ఇది రెండో సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న డిఫరెంట్ కమర్షియల్ మూవీ ఇది. కాజల్ కథానాయిక. శనివారం నుంచి ఏకధాటిగా జరిగే షూటింగ్తో చిత్రం పూర్తవుతుంది. వచ్చే జనవరి 9న విడుదల చేస్తాం' అని తెలిపారు.
ప్రకాశ్రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, బెనర్జీ, వెన్నెల కిశోర్, జయప్రకాశ్రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్రాలోకేశ్ ఇతర ముఖ్యపాత్రలను పోషించే ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: శివబాబు, మాటలు, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.