Don't Miss!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఈ సినిమా మరో అంకుశం అవుతుంది: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్
పోలీస్ నేపథ్యంలో సినిమా అనగానే.. ముందు 'అంకుశం" గుర్తొస్తుంది. ఆ సినిమాతో పోలీస్ పాత్రలకు గౌరవం తెచ్చిపెట్టారు రాజశేఖర్. మళ్లీ 'మహంకాళి" చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఆయన సతీమణి జీవిత ఈ సినిమాకు దర్శకురాలు. యేలూరు సురేందర్రెడ్డి, ఎం.పరంధామరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ''ఉగ్రవాదుల దుశ్చర్యలను ఓ పోలీస్ అధికారి ఎదుర్కొన్న తీరే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
వాస్తవికతకు పెద్ద పీట వేస్తూ జీవిత ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఆమె సమకూర్చిన స్క్రీన్ప్లే ఈ సినిమాకు హైలైట్"" అన్నారు. ''ఇప్పటి వరకూ ఓ పాట, 70 శాతం టాకీ పూర్తయింది. ఈ నెల 27 నుంచి ఆర్ఎఫ్సీలో చివరి షెడ్యూల్ మొదలవుతుంది. 28 నుంచి రాజశేఖర్, కౌష, జీవా, సలీంపండా తదితరులపై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తాం.
ఆ తర్వాత నళిని, సత్యప్రకాష్, ప్రభాకర్ తదితరులపై కీలక సన్నివేశాలను తీస్తాం. ఫిబ్రవరి 18 వరకూ జరిగే చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది"" అని జీవిత తెలిపారు. మధురిమ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్, వినోద్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: మోహన్, కెమెరా: అరవింద్, సంగీతం: చిన్నా, నిర్మాణం: అంజేరి ఆర్ట్స్.