Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మహర్షి’ మూవీ బడ్జెట్ కంట్రోల్ తప్పిందా? మొత్తం ఎంత ఖర్చయింది?
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా మొదలై థియేటర్లలోకి వచ్చే గ్యాపులో రకరకాల పుకార్లు షికార్లు చేయడం సర్వసాధారణమే. సూపర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం 'మహర్షి' విషయంలో ఇప్పటికే లెక్కలేనని గాసిప్స్ వినిపించాయి. నిప్పులేనిదే పొగరాదు. చాలా సందర్భాల్లో ఈ గాసిప్స్ నిజం అవుతాయి కూడా...
తాజాగా 'మహర్షి' మూవీ బడ్జెట్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ కంట్రోల్ తప్పిందని, దర్శకుడు వంశీ పైడిపల్లి తాను ముందుగా నిర్ణయించి బడ్జెట్లో సినిమా పూర్తి చేయలేదని టాక్.
ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు?
‘మహర్షి' సినిమాను తాను అనుకున్న విధంగా తీసేందుకు దర్శకుడు వంశీ పైడిపల్లి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో షూటింగ్ జరిగే రోజులు పెరిగిపోయాయని, ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ. 130 కోట్ల పై చిలుకు ఖర్చుపెట్టినట్లు సమాచారం.
పని దినాలు పెరిగాయి
కారణాల సంగతి పక్కన పెడితే 100 నుంచి 110 పనిదినాల్లో పూర్తి కావాల్సిన సినిమా... దాదాపు 150 రోజులు తీసుకుందని తెలుస్తోంది. ఈ కారణంగా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని, మహేష్ బాబు సినిమా కావడం, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి లాంటి స్టార్ ప్రొడ్యూసర్లు ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్ కావడంతో ఖర్చుకు వెనకాడలేదని తెలుస్తోంది.
మహేష్ బాబు మేడమ్ టుస్సాడ్స్ స్టాచ్యూ: ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ ఫోజులు (ఫోటోస్)
సూపర్ స్టార్ ఇమేజ్ మీద నమ్మకంతోనే..
ఇప్పుడు మహేష్ బాబు సినిమా మార్కెట్ వ్యాల్యూ మినిమమ్ రూ. 200 కోట్లు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటు యువతతో పాటు అటు ఫ్యామిలీ ప్రేక్షకులను కేవలం తన ఇమేజ్తో థియేటర్లకు రప్పించే టాప్ హీరో మహేష్ బాబు. ఆ నమ్మకంతోనే ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టారట.
మే 9 రిలీజ్, ప్రమోషన్స్ షురూ...
‘మహర్షి' చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు మార్చి 29 నుంచి ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘చోటీ చోటీ బాతే' రేపు ఉదయం 9.09 గంటలకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
భారీ తారాగణం
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు సోనాల్ చౌహాన్, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ, పోసాని కృష్ణమురళి, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తొలి సాంగ్ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో
మార్చి 29న విడుదల కాబోయే తొలి పాట ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఉండబోతోంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ మీద ఈ సాంగ్ చిత్రీకరించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.