బోయపాటి శ్రీనుకి మహేష్ బాబు ఆ సలహా?
బోయపాటి శ్రీను, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ చిత్రం త్వరలో తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బోయపాటి శ్రీను సైతం రీసెంట్ గా మీడియా వద్ద కన్ఫర్మ్ చేసి చెప్పారు. అయితే బోయపాటి శ్రీను తీసే సినిమాలకు, మహేష్ సినిమాలుకు చాలా డిఫెరెన్స్ ఉంటుంది. మహేష్ సినిమాలు కాస్త స్మూత్ గా నడిస్తే... బోయపాటి హీరోలు ఎప్పుడూ రఫ్ అండ్ టఫ్ గా బిహేవ్ చేస్తూంటారు. అయితే మహేష్ సైతం మాస్ మాసాలా సినిమాలనుకుంటున్న నేపధ్యంలో బోయపాటి శ్రీనుకి అవకాశమివ్వటం జరిగింది.
ఈ నేపధ్యంలో రీసెంట్ గా బోయపాటి శ్రీను.. మహేష్ ని కలిసి ఓ కథని నేరేట్ చేసాడని వినికిడి. కథ అంతా విన్న మహేష్ బాబు.. చెప్పే విధానాన్ని మెచ్చుకుని, తన సినిమాలు ఒక్కసారి చూడమని, తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు కథలో మార్పులు చేయమని, డైలాగులు సైతం తనకు అనుగుణంగా మార్చమని సలహా ఇచ్చినట్లు సమాచారం. సరేనన్న బోయపాటి శ్రీను తన రైటర్స్ తో ఆ పని మీద ఉన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను తన తాజా చిత్రం దమ్ములో బిజీగా ఉన్నారు.
అలాగే ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ని పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూలర్ అనే పదం బాగా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. దమ్ము సినిమాలోని ఓ పాటలో ఈ పదం వస్తుంది. అలాగే బాలకృష్ణ అధినాయుకుడు పోస్టర్స్ పై కూడా హి రూల్స్ అని వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ తదుపరి చిత్రానికి రూలర్ టైటిల్ పెట్టే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దీనికి కారణం బూరుగు పల్లి శివరామకృష్ణ ఈ టైటిల్ ని పిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయటమే.
బూరుగుపల్లి శివరామకృష్ణ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నారు. దాంతో ఆ చిత్రానికి రూలర్ అనే పేరు పెడతారని గుసగుసలు మొదలయ్యాయి. అందులోనూ ఆ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరక్ట్ చేయనున్నారు. బోయపాటి శ్రీను చిత్రం దమ్ములోని పాట పదమే కాబట్టి అలా ఫిక్సయ్యారన్నమాట. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను ..దమ్ము ట్రైలర్స్ విడుదల చేసి విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసి వాటిని అందుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. దమ్ము చిత్రం ఏప్రియల్ 27 న విడుదల కానుంది.
ఇక నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రస్తుతం దరువు చిత్రం చేస్తున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యం శివ డైరక్ట్ చేస్తున్నారు. 'దరువు'. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం మే 4న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు. మహేష్ బాబు వరస సినమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను చిత్రం ఉండనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











