Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రాఫిట్ లో షేర్ అడుగుతున్న మహేష్ బాబు
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు సెన్సేషన్ హిట్ అయిన నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం ది బిజెనెస్ మ్యాన్ బిజెనెస్ లో షేర్ అడుగుతున్నట్లు సమాచారం. ఎందుకంటే దూకుడు బ్రాండ్ నేమ్ తో బిజెనెస్ మ్యాన్ కి విపరీతమైన క్రేజ్ మార్కెట్లో నెలకొని ఉంది. దాంతో మహేష్ తన క్రేజ్ పై జరుగుతున్న వ్యాపారంలో తానూ పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందు నిమిత్తం ఇప్పటికే నిర్మాతలు ఆర్.ఆర్. మూవీ మేకర్స్ తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది.
'బిజినెస్మ్యాన్'గా టైటిల్కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.