Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
క్రేజీ అప్డేట్: మహేష్ బాబుతో కీర్తి సురేష్ రొమాన్స్!
ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. మహేష్ కెరీర్లో 27వ మూవీగా రూపొందనున్న ఆయన నెక్స్ట్ సినిమాకు క్రేజీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు.
నిజానికి మహేష్ బాబు తన 27వ సినిమాను వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ కావడంతో.. డైరెక్టర్ పరశురామ్ లైన్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మే 31న సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంలో మహేష్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై కీలక నిర్ణయం తీసుకుందట చిత్రయూనిట్. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో కీర్తి సురేశ్ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నాయి. మహేష్ బాబు కోరిక మేరకు ఈ సినిమాను 2021 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా మహేష్ 27 కోసం అభిమానలోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.