Don't Miss!
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
మహేష్ బాబుపై రామ్ గోపాల్ వర్మ కోతలేనా?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల కిందట సడెన్గా 'ఖైదీ" సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ట్విట్టర్లో ట్వీటిన విషయం తెలిసిందే. ఈ వార్త విని అంతా షాక్ అయ్యారు. దీనికి తోడే వర్మ వ్యాఖ్యలకు మద్దతుగా మరో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ట్వీటడం తో సర్వత్రా ఈ విషయం చర్చనీయాంశమైంది. మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం...వర్మ చెప్పినట్లు ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశాల లేవనే వాదన వినిపిస్తోంది. వర్మ కోసే కోతల్లో చాలా వరకు వాస్తవ రూపం దాల్చ బోవని, అందులో ఖైదీ కూడా ఒకటని అంటున్నారు. పైగా చిరంజీవీ నటించిన సినిమా రీమేక్లో మహేష్ బాబు నటించే అవకాశాలు అస్సలు లేవని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు పూరీ జగన్నాథ్ దర్శత్వంలో 'ది బిజినెస్ మ్యాన్" సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2012లో సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. దీని తర్వాత మహేష్ దిల్ రాజు దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో నటిస్తున్నారు. అయితే తన తండ్రి నటించిన అల్లూరి సీతారామ రాజు సినిమా రీమేక్ లో మాత్రం మహేష్ బాబు తప్పకుండా నటించాలని డిసైడ్ అయ్యాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త.