Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ.. ప్రముఖ నిర్మాతతో మల్టీస్టారర్ మూవీ!
సూపర్స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై రకరకాల ఊహగానాలు మీడియాలో ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ అవి వాస్తవ రూపం దాల్చలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మళ్లీ మహేష్ హిందీ చిత్ర రంగంలోకి అడుగుపెడుతున్నారనే వార్త మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా ముంబైలో జరిగిన కొన్ని ఈవెంట్లు ఈ వార్తకు బలాన్ని ఇస్తున్నాయి. ఈ రూమర్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ముంబైలో మూడోసారి షూట్
సరిలేరు నీకెవ్వరు సినిమా విజయం తర్వాత మహేష్ బాబు మంచి జోష్లో ఉన్నారు. తాజాగా మూడోసారి ఓ వ్యాపార ప్రకటనలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో నటించారు. గత రెండేళ్లలో ఇలా వారిద్దరూ నటించడం మూడోసారి. ముంబైలో షూట్ సందర్భంగా మహేష్బాబుతో బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత సంప్రదింపులు జరిపారనేది తాజా వార్త సారాంశం.
సాజిద్ నడియావాలా ప్యాన్ ఇండియా మూవీ
మహేష్బాబుతోపాటు రణ్వీర్ సింగ్ గానీ, లేదా మరో హీరోతో బాలీవుడ్లో మల్టీ స్టారర్ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని నిర్మాత సాజిద్ నడియావాలా ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే మహేష్ బాబు మాత్రం కచ్చితమైన క్లారిటీ ఇవ్వలేదని.. త్వరలో నటించే విషయంపై క్లారిటీ ఇస్తానని వెల్లడించినట్టు తెలుస్తున్నది.
ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురుచూపులు
ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ చేసేశాడు. సాహో సినిమా దక్షిణాదిలో పెద్దగా ఆడకపోయినా.. హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఇక ఎప్పటి నుంచో బాలీవుడ్లో ఎంట్రీ ఉంటుందనే వార్త ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతున్నది. త్వరలోనే అభిమానుల కోరిక తీరే అవకాశం లేకపోలేదనే వార్త వినిపిస్తున్నది.
Recommended Video
చిరంజీవి మూవీలో మహేష్ బాబు
సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా.. అది వెనకకు వెళ్లింది. ప్రస్తుతానికి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి ఆచార్య చిత్రంలో మహేష్ బాబు విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నారు. ఆ తర్వాత గీతా గోవిందం ఫేమ్ పరుశురాం సినిమాలో నటించే అవకాశం ఉంది.