twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ షాకింగ్ నిర్ణయం.. వంశీ పైడిపల్లిని పక్కకి నెట్టేస్తూ.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్

    |

    భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుసగా రెండు వందల కోట్లు కొల్లగొడుతూ వస్తున్న మహేష్.. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ మధ్య విశ్రాంతి తీసుకున్న మహేష్.. తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనేక రకాలు వార్తలు పుట్టుకొస్తున్నాయి. వాటి సంగతేంటో ఓ సారి చూద్దాం.

     మహేష్-వంశీ ప్రాజెక్ట్..

    మహేష్-వంశీ ప్రాజెక్ట్..

    మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అందుకే మళ్లీ వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో ఉంటుందని మహేష్ కూడా అనౌన్స్ చేసేశాడు. అయితే ఈ నిర్ణయంలో అనూహ్యమైన మార్పులు సంభవించాయని తెలుస్తోంది.

    వంశీ సినిమా పక్కకు..

    వంశీ సినిమా పక్కకు..

    వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ బాగుందని మహేష్ ఓకే చెప్పాడట. అయితే పూర్తి స్క్రిప్ట్ విషయంలో మాత్రం మహేష్‌ను మెప్పించలేకపోయాడని తెలుస్తోంది. అందులో మహేష్ చాలానే మార్పులు చేర్పులు సూచించాడని టాక్. అవన్నీ సెట్ చేయడానికి, మళ్లీ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి చాలానే సమయం పట్టేట్టు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లినట్టు టాక్.

    పరుశురామ్ లైన్‌లోకి..

    పరుశురామ్ లైన్‌లోకి..

    గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత దర్శకుడు పరుశురామ్ మహేష్ బాబుకు ఓ కథ వినిపించాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కథ నచ్చినా కూడా పరుశురామ్‌ను మాత్రం వెయిట్ చెయించి.. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేశాడు. అయితే పరుశురామ్ కూడా ఇదంతా వర్కౌట్ కాదని వేరే హీరోలను వెతుక్కున్నాడు. తాజాగా వినిపిస్తున్న సమచారం మేరకు మహేష్ పరుశురామ్‌పై కన్నేశాడని తెలుస్తోంది.

    Recommended Video

    Actor Sunil & Rana Daggubati Must Learn From Mahesh Babu - Imandi Ramarao | Filmibeat Telugu
    నాగ చైతన్య ప్రాజెక్ట్ కంటే ముందే..

    నాగ చైతన్య ప్రాజెక్ట్ కంటే ముందే..

    పరుశురామ్-నాగ చైతన్య ప్రాజెక్ట్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీ టైటిల్ నాగేశ్వరరావు అని ఇందులో రష్మిక లేదా కీర్తి సురేష్‌లో ఎవరో ఒకర్నీ తీసుకోబోతోన్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తాజాగా మాత్రం మరో రకమైన వార్తలు పుట్టుకొచ్చాయి. పరుశురామ్‌-మహేష్ కాంబినేషన్‌లోనే మొదటగా చిత్రం వస్తుందట.. దాని తరువాతే ఏ సినిమానైనా చేయబోతోన్నాడట. దీనికి సంబంధించిన ప్రకటన ఓ రెండు మూడు రోజుల్లోనే మైత్రీ సంస్థ ప్రకటిస్తుందట. ఈ ఏడాదిలోనే ఆ సినిమా విడుదలయ్యేట్టు ప్లాన్ చేస్తారని టాక్.

    English summary
    Mahesh Babu Cancelled Vamsi Paidipally And Says Ok For Parasuram. Buzz Is That Vamsi Paidipally Failed To Satisfy With Full Script So That Mahesh Wants To Do With Parasuram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X