Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు చిత్రం... ఓ స్పై థ్రిల్లర్ (అఫీషియల్)
హైదరాబాద్ : హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ బాబు స్పై థ్రిల్లర్ లో కనపించనున్నాడా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మణిరత్నం దర్శకత్వంలో మహేష్ ఓకే చేసిన సబ్జెక్టు ఓ స్పై థ్రిల్లర్ అని దేశభక్తి అండరకరెంట్ గా సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకూ ఇండియన్ తెరపై కనిపించని విజువల్స్ ని మణి ప్లాన్ చేస్తున్నాడంటున్నారు. నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ విషయమై సుహాసినీ మణిరత్నం మీడియాకు ఖరారు చేసి తెలిపింది.
సుహాసిని మాట్లాడుతూ... " బోర్న్ ఐడింటిటీ చిత్రం తరహాలో మా చిత్రం ఓ స్పై థ్రిల్లర్. ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించనున్నాం. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, శృతి హాసన్ మాత్రమే కాక హీరోయిన్ కి అవకాసం ఉంది. ఆ పాత్రను ఇరానీ లేదా పాకిస్ధానీ నటి అవకాసం ఉంది ," అని చెప్పుకొచ్చింది.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ సైతం కీలకమైన పాత్రను పోషించనుంది. ఈ మేరకు ఐశ్వర్యారాయ్ ని కలిసినట్లు,మణిరత్నం ఆఫీస్ వర్గాలు థృవీకరించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా చేయనుంది. నాగార్జున,ఐశ్వర్యారాయ్ ఇప్పటికే సైన్ చేసారని తెలుస్తోంది. అయితే మహేష్,శృతి హాసన్ ఇంకా ఎగ్రిమెంట్ లోకి రాలేదు. మహేష్ బాబు కొన్ని సూచనలు చేసారని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు వినికిడి. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. నిజానికి, పొన్నియన్ సెల్వన్ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద కొరటలా శివ సినిమాలో నటించడానికి కూడా మహేష్ బాబు అంగీకరించాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మణిరత్నం సినిమా ప్రారంభమవుతుందా, దాంతో పాటు ఈ సినిమాను మహేష్ బాబు చేస్తాడా అనేది తెలియడం లేదు.