Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేశ్ సినిమా హిట్ అవ్వాలంటే అలా చేయాల్సిందేనట! ఫాలో అయిపోతున్న అనిల్ రావిపూడి
'మహర్షి' సక్సెస్తో జోష్ మీదున్నాడు సూపర్స్టార్ మహేశ్ బాబు. ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో అదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే.. 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్గా నటిస్తున్నాడు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అలాగే, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు' కోసం సెట్
‘సరిలేరు నీకెవ్వరు' కోసం ఓ విలేజ్ సెట్ వేయిస్తున్నారట. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు మూడు ఎకరాల్లో ఈ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ సారథ్యంలో ఈ సెట్ పనులు జరుగుతున్నాయట. విలేజ్లో షూటింగ్ అంటే ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశ్యంతో ఈ సెట్ వేయిస్తున్నట్లు యూనిట్ చెబుతోంది. కానీ, ఫిలింనగర్లో మాత్రం వేరే ప్రచారం జరుగుతోంది.
మహేశ్ సెంటిమెంట్
మహేశ్ గత చిత్రాలు ‘మహర్షి', ‘భరత్ అను నేను'లో కూడా ప్రత్యేక సెట్ వేశారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అవడంతో ‘సరిలేరు నీకెవ్వరు'లో కూడా ఈ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారని చిత్ర సీమలో ప్రచారం జరుగుతోంది. సెట్ వేస్తే సినిమా సక్సెస్ అనే సెంటిమెంట్ ఉండడం వల్లే మహేశ్.. దర్శకుడితో ఈ విషయమై మాట్లాడినట్లు చెబుతున్నారు.
మహేశ్ అంటేనే సెట్లు
ప్రత్యేక సెట్ అంటేనే మహేశ్ సినిమాలు గుర్తుకొస్తుంటాయి. ఈ సూపర్స్టార్ సినిమాలకు సెట్ వేసినట్లు మరే హీరో సినిమాకు వేసి ఉండరు. మహేశ్ నటించిన ‘ఒక్కడు', ‘మురారి', ‘అతడు', ‘అర్జున్', ‘సైనికుడు', ‘శ్రీమంతుడు', ‘భరత్ అను నేను', ‘మహర్షి' సహా పలు సినిమాలకు ప్రత్యేకంగా సెట్లు వేశారు.
వీటిలో హిట్లే ఎక్కువ
మహేశ్ బాబు సెట్ వర్క్ను సెంటిమెంట్గా పెట్టుకున్నాడంటూ ప్రచారం జరగడానికి హిట్ సినిమాలే కారణం. అతడు నటించిన వాటిలో సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘ఒక్కడు', ‘మురారి', ‘అతడు', ‘శ్రీమంతుడు', ‘భరత్ అను నేను', ‘మహర్షి' సూపర్ హిట్ అవడంతో కొత్త సినిమాలోనూ ఇదే ఫాలో అయిపోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.