Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హిట్ డైరెక్టర్కు షాకిచ్చిన మహేశ్.. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్
రైతు సమస్యలతో వచ్చిన 'మహర్షి' సినిమా హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి మరోసారి మేకప్ వేసుకుంటున్నారు. ఇందులో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్రను పోషిస్తున్నాడు.
ఇటీవల మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను, స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కారణంగా విరామం లేకుండా షూటింగ్ చేస్తోంది చిత్ర యూనిట్.
'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ చేయబోయే సినిమాపై క్లారిటీ లేదు గానీ, కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తమ సంస్థలో సినిమా చేయబోతున్నారని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ప్రకటించారు. 'మహేశ్ బాబు గారు కూడా మా సంస్థలో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నారు. ఈ మధ్యనే పరశురాం చెప్పిన కథను విన్నారు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఈ సినిమా సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది' అని తెలిపారు.
అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పరశురాంతో సినిమా చేయడానికి మహేశ్ అంత ఆసక్తిగా లేడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయనకు, నిర్మాణ సంస్థకు కూడా వెల్లడించాడని టాక్. దీనికి కారణం మహేశ్ మరోసారి వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి సన్నాహాలు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అన్నట్లు పరశురాం తన గత చిత్రం 'గీత గోవిదం'తో భారీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కరిపించింది.