Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు ముంబై ప్రయాణం ఎందుకంటే...
రీసెంట్ గా పూనెలో ఓ నెల రోజులు పాటు గడిపిన మహేష్ బాబు జూలై ఒకటి నుంచి ముంబైలో మకాం వేయనున్నారు. అక్కడ ఓ రెండు పాటల షూటింగ్ జరగనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రంకిదే లాస్ట్ షెడ్యూల్. ఈ పాటలతో పూర్తి స్ధాయిలో షూటింగ్ పూర్తి కానుంది. హీరోయిన్ గా అనూష్క చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ కానుంది. ఆ రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావటంతో ఆ డేట్ నిర్ణయించారు.
అతడు వంటి హిట్ చిత్రం అనంతరం మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక పవన్ తో పులి చిత్రం నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక అతిధి చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తో ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్లతో చేసే చిత్రం ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సురేంద్ర రెడ్డితో మిస్టర్ ఫెరఫెక్ట్, లింగుస్వామితో చేసే చిత్రం ఉంటుంది.