Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సొనాలి బింద్రే కోరిక తీర్చనున్న మహేష్బాబు.. క్యాన్సర్ వ్యాధిన పడిన బ్యూటీకి..
Recommended Video
క్యాన్సర్ వ్యాధితో బాలీవుడ్ అందాల నటి సొనాలి బింద్రేను తన సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా సొనాలిని కలుసుకొన్న వారిలో ప్రిస్స్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉన్నారు. సోనాలిని కలిసిన విషయంపై నమ్రతా శిరోద్కర్ ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. నమ్రత ఏమన్నారంటే..
కంటిచూపు మందగించింది.. బాధను పంచుకొన్న సొనాలి బింద్రే
క్యాన్సర్ను ఎదురించడంలో సొనాలి బింద్రే
క్యాన్సర్ వ్యాధికి గురైనప్పటికీ దానిని ఎదురించడంలో సొనాలి బింద్రే ఎంతో మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా ధైర్యంగా ఆమె ఉన్నారు. త్వరలోనే నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తారు. సొనాలిని చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలిగింది. చాలా విషయాలు మాట్లాడుకొన్నాం. అనారోగ్యం నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
అందుకే కలిశామని
బాలీవుడ్లో నేను నటించేటప్పటి నుంచే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ స్నేహమే మా ఇద్దరిని కలుసుకొనేలా చేసింది. మహారాష్ట్రీయులమనే బంధం చాలా బలంగా ఉంది. గతంలోని సంఘటనలు గుర్తు చేసుకోని చాలా నవ్వుకొన్నాం. సొనాలి చాలా రిలీఫ్గా కనిపించింది అని నమ్రత పేర్కొన్నారు.
ఎక్కువ సేపు గడపలేక పోయాం
మా అమెరికా పర్యటన చాలా బిజీ బిజీగా ఉంటంతో సొనాలితో గడిపేందుకు ఎక్కువ సమయం దొరకలేదు. సొనాలి కుమారుడు రణ్వీర్, భర్త గోల్డీ బెహల్ను నేను, నా కుమారుడు గౌతమ్ కలుసుకొన్నాం. త్వరలోనే సొనాలిని కలిసి ఎక్కువ సేపు గడపుతానని మాటిచ్చాను అని నమ్రత పేర్కొన్నారు.
స్వచ్ఛంద సంస్థను స్థాపించే ఆలోచనలో
క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొన్న తర్వాత సొనాలి ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్నారు. దారుణమైన వ్యాధిన పడిన పేదల ఆరోగ్యం కోసం పనిచేస్తాననే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. తన సేవకు అండగా నిలస్తామని వారిద్దరి మధ్య వచ్చిన చర్చల్లో నమ్రత చెప్పినట్టు సమాచారం.
మహేష్ బాబు సహాకారంతో
సొనాలి స్థాపించబోయే స్వచ్ఛంద సంస్థ కోసం మహేష్ సహకారం కూడా తీసుకోవాలని అనుకొంటున్నట్టు తెలిసింది. నమ్రత సూచన మేరకు మహేష్ బాబు కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. తెలుగులో మురారీ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, సొనాలి కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇంకా ఇంద్ర చిత్రంలో కూడా చిరంజీవిం సరసన జతకట్టింది.