Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మహేష్ బాబు సూపర్ అప్డేట్.. మళ్ళీ అదే రిపీట్! అభిమానులకు పండగే పండగ..
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సంక్రాంతి ట్రీట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు అంటూ సంక్రాతికి మహేష్ బాబును దించుతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కాగా తాజాగా సూపర్ స్టార్ మహేష్కి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సూపర్ అప్డేట్ చూసి మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏంటా అప్డేట్? ఆ సంగతులేంటో చూద్దామా..
స్టార్ హీరోల అభిమానులకు ఎక్కడాలేని ఆతృత
తమ అభిమాన హీరో తాజా సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలియడమే ఆలస్యం, ఆయన తదుపరి సినిమా ఏమై ఉంటుందని స్టార్ హీరోల అభిమానులు వేయి కళ్ళతో వెతుకుతుంటారు. ఈ విషయంలో వారికి ఎక్కడాలేని ఆతృత నెలకొంటుంది. దీంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అదే బాటలో ఓ వార్త షికారు చేస్తోంది.
సైరా.. సురేందర్ రెడ్డితో మహేష్
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. దీంతో ఈయన తీయబోయే తదుపరి సినిమాలపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు సురేందర్ రెడ్డికి మహేష్ బాబుకి మధ్య ఒప్పదం కుదిరిందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ను కలసిన సురేందర్ రెడ్డి తన వద్ద ఉన్న కథ ఆయనకు వివరించాడని ఫిలింనగర్ టాక్.
అప్పుడలా జరిగిపోయింది.. అందుకే
దీనిపై మహేష్ సైతం సుముఖత వ్యక్తం చేశారనేది లేటెస్ట్ అప్డేట్. గతంలో సురేందర్ రెడ్డి, మహేష్ బాబు కాంబోలో ‘అతిధి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2007 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో ఆ లోటును పూడ్చేలా.. మళ్ళీ ఇప్పుడు సురేందర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నమే ఇది అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదే జరిగితే మహేష్ అభిమానులకు పండగే
'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్ బాబుతో దర్శకులు ప్రశాంత్ నీల్ గానీ, వంశీ పైడిపల్లి గానీ సినిమా చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఎవరితోనూ సినిమా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డితో మాత్రం సినిమా పక్కా అంటున్నారు. అతి త్వరలో ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుంది. ఇదే జరిగితే మహేష్ అభిమానులకు పండగే మరి.
మహేష్.. సరిలేరు నీకెవ్వరు
ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. విజయశాంతి, బండ్ల గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.