Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఐపీఎల్ టీం కొనుగోలు చేయబోతున్న మహేష్ బాబు?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు సినిమాలు, వాణిజ్య ప్రకటనలకే పరిమితం అయ్యారు. తాజాగా ఆయన మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా భారత్ లో అత్యంత ఆదరణ పొందించిన క్రీకెట్కు సంబంధించిన వ్యాపారంలోకి.
ఆయన ఐపీఎల్ టీం కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్తో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ ఇపుడు సపరేట్ రాష్ట్రం అయిన నేపథ్యంలో హైదరాబాద్ సన్రైజర్స్ తెలంగాణ టీం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రలో కూడా ఓ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
దీనికి ‘వైజాగ్ సిక్సర్స్' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 2017లో ఈ టీం ఐపీఎల్లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. త్వరలో మహేష్ బాబు నుండి ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అకాశం ఉందని టాక్. మహేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ఉండటంతో ఐపీఎల్ టీం కొనుగోలు బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.