twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ని దావూద్ కిడ్నాప్?

    By Staff
    |

    Mahesh Babu
    వినటానికి నవ్వు వచ్చేలా వున్నా..మహేష్ కిడ్నాప్ అయ్యాడన్న రూమర్ ఫిల్మ్ నగర్ అంతటా వినపడుతోంది. మహేష్ బాబును దావూద్ ఇబ్రహీం మనుషులు మలేసియాలో కిడ్నాప్ చేశారని ఆ రూమర్ సారాంశం. మలేసియాలో నవరతన్ ఆయిల్ షూటింగ్‌లో పాల్గొంటున్న మహేష్‌ను దావూద్ అనుచరులు అపహరించుకుని వెళ్లారని చెప్పుతున్నారు. నిజమెంతో తెలియదు గానీ అంతటా ఇదే టాపిక్ నడుస్తోంది. ఇక ఈ న్యూస్ కరెక్టా కాదా అని మహేష్ మేనేజర్‌ను ఫోనులో కాంటాక్ట్ చేద్దామని కొందరు ఔత్సాహికులు ప్రయత్నిస్తే..అతని ఫోను స్విచాఫ్ చేసి ఉందని తెలుస్తోంది. అలాగే మహేష్ సన్నిహితులెవరూ ఫోనులో దొరకలేదని అంటున్నారు.

    ఇక ఈ మ్యాటర్ ఇలా ఉంటే...ఈ కిడ్నాప్‌కు మహేష్ కుటుంబ గొడవలే కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. వారు చెప్పే దాని ప్రకారం గత కొన్ని రోజులుగా మహేష్ భార్య నమ్రత, మహేష్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయని నమ్రతే చీటికి మాటికి మహేష్‌తో గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కి దావూద్ కి దగ్గర రిలేషన్స్ ఉన్నాయనే అవి ఉపయోగించుకునే బావగారికి ఇలా ట్విస్ట్ ఇచ్చిందంటున్నారు. ఈ గొడవకు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇది కేవలం రూమరే అయితే ఇబ్బంది లేదు..నిజమే అయితే ప్రమాదంలో ఉన్నట్లే. ఏదైమైనా చిరకాలం విరామం తర్వాత వరుడు ప్రారంభం అవుతున్న సమయంలో ఇలాంటి వార్తలు రావటం దురదృష్ఠమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X