Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
క్ఱిష్,అశ్వనీదత్ కాంబినేషన్ ఆ స్టార్ తో
గమ్యం, వేదం చిత్రాలతో తనకంటూ క్రేజ్ క్రియోట్ చేసుకున్న దర్శకుడు క్రిష్. ఆయన తన తదుపరి చిత్రానికి గత కొద్ది రోజులుగా స్క్రిప్టు రెడీ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ స్క్ర్రిప్టుని మహేష్ కి వినిపించి ఓకే చేయించుకున్నట్లు విశ్వ సనీయ సమాచారం. అలాగే చిత్రాన్ని వైజయింతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రానికి శివం అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం ఆగస్టు9, 2012 న ప్రారంబించనున్నట్లు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ పూర్తిగా దూకుడు చిత్రం లో బిజిగా ఉన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో లో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
దూకుడు గురించి రచయిత గోపీ మోహన్ మాట్లాడుతూ..."ఇప్పటివరకు మనం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాం. కామెడీ సీన్లలో తప్ప పవర్ఫుల్ డైలాగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఈ సినిమా దానికి లాంచింగ్గా ఉండాలి. ఇక నుంచీ మనల్ని కూడా అలాంటి డైలాగ్స్ పెట్టమనేటట్లుండాలి" అని. ఇందులో డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ సైడ్ వచ్చేసరికి శ్రీను వైట్ల తరహాలోనే ఉంటాయి. యాక్షన్, పవర్ఫుల్ సైడ్ వచ్చేసరికి మహేశ్ తరహాకి మేం వెళ్లాం. ఆయన కూడా అదే స్టైల్కి మలుచుకుని చెప్పారు. ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.