Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సైలెంట్ గా ప్లాన్ వేస్తున్న సూపర్ స్టార్ మహేష్ .. మరో కథ కోసం చర్చలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరకు చాలా గ్యాప్ ఇవ్వాల్సి వస్తోంది. గత ఏడాది మొదట్లో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా మంది అగ్ర హీరోల సినిమాలు ఈ ఏడాదిలోనే రావాల్సి ఉండగా అనుకోకుండా కరోనా ధాటికి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక సర్కారు వారి పాట కూడా అదే తరహాలో నెక్స్ట్ ఇయర్ కు వెళ్లిపోయింది. ఇక ఆ సినిమా తరువాత మహేష్ మరో మినీ మూవీ చేసే ఛాన్స్ ఉన్నట్లు కొత్త రూమర్ ఒకటి వైరల్ అవుతోంది.
వీలైనంత త్వరహా ఫినిష్ చేయాలని..
గీత గోవిందం వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది కాబట్టి సినిమా చాలా స్లోగా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి మహేష్ ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడు.
పాతికేళ్ల కుర్రాడిలా..
సినిమాలో మహేష్ సరికొత్త లుక్ తో కనిపించనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సుకుమార్ కూతురు ఫంక్షన్ కు వెళ్లిన మహేష్ అక్కడ ఒక పాతికేళ్ల కుర్రాడిలా కనిపించాడు. హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇటీవల దుబాయ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
మారో కొత్త టార్గెట్
అయితే మొదట సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను సమ్మర్ ఎండింగ్ లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. కానీ ఎంత ట్రై చేసినా ప్లాన్ వర్కౌట్ అవ్వడం లేదని తెలుస్తోంది. అందుకే దసరా సమయానికి పూర్తి చేసి మరొక కొత్త టార్గెట్ సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అప్పుడు పూర్తయితే మహేష్ తదుపరి సినిమా చేయడానికి కొంత గ్యాప్ దొరుకుతుంది.
దర్శకులతో చర్చలు
రాజమౌళితో ఒక సినిమా అనుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానుంది. అందుకే మధ్యలో నాలుగు నెలల్లో ఏదైనా చిన్న సినిమాను పూర్తి చేయాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకే మళ్ళీ అనిల్ రావిపూడిని లైన్ లో పెట్టినట్లు టాక్. అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా స్టోరీ వినిపించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరిలో ఎవరు కథతో మెప్పించినా కూడా కొత్త సినిమాపై మహేష్ ఒక నిర్ణయానికి రావచ్చని సమాచారం.