Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అంటే....మహేష్ బాబుతో సినిమా లేనట్లేనా?
హైదరాబాద్: మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా ఉత్సాహపడ్డారు..అయితే ఆయన ఎంతకీ తేల్చకపోవటంతో షాహిద్ కపూర్ తో ముందుకు వెళ్లిపోతున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు కృష్ణ నిడిమోరు, రాజ్ డి.కె. ఈ దర్శక ద్వయం ఆ మధ్యన మహేష్ ని కలిసి కథ వినిపించారని సమాచారం. అయితే మహేష్ పెద్దగా ఆసక్తి చూపించలేదని తర్వాత అర్దమైంది. ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయితే అశ్వనీదత్ నిర్మించాలనే ప్రపోజల్ ఉంది. అయితే మహేష్ ఎంతకీ విషయం తేల్చకపోవటంతో వారు షాహిద్ కపూర్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
వీరిద్దరూ కలిసి గతంలో 99, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ చిత్రాలు డైరక్ట్ చేసారు. అలాగే డి ఫర్ దోపిడి అనే చిత్రం నిర్మించారు. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. మహేష్ బాబుతో తెలుగులో డైరక్టర్ గా లాంచ్ కానున్నారని, ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తారని అఫీషియల్ గానే వార్తలు వచ్చాయి. అశ్వనీదత్ సైతం ఈ చిత్రం విషయమై మాట్లాడారు.
అప్పట్లో అశ్వనీదత్ మాట్లాడుతూ.... ''మహేష్తో ఇది మా మూడో చిత్రం. 2014 ప్రధమార్ధంలో సినిమాని ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. మహేష్బాబు శైలి, ఇమేజ్కి తగిన కథ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతాము''అన్నారు. వైజయంతి మూవీస్ సంస్థ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అయితే ఇప్పుడు అసలా ఊసే లేకుండా పోయింది.
ప్రస్తుతం వారు హ్యాపీ ఎండింగ్ అనే చిత్రం చేస్తున్నారు. ఇలియానా,సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. హ్యాపీ ఎండింగ్ ప్రాజెక్టు పూర్తి కాగానే షాహిద్ కపూర్ సినిమా ప్రారంభమవుతుంది.