Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అంటే....మహేష్ బాబుతో సినిమా లేనట్లేనా?
హైదరాబాద్: మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా ఉత్సాహపడ్డారు..అయితే ఆయన ఎంతకీ తేల్చకపోవటంతో షాహిద్ కపూర్ తో ముందుకు వెళ్లిపోతున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు కృష్ణ నిడిమోరు, రాజ్ డి.కె. ఈ దర్శక ద్వయం ఆ మధ్యన మహేష్ ని కలిసి కథ వినిపించారని సమాచారం. అయితే మహేష్ పెద్దగా ఆసక్తి చూపించలేదని తర్వాత అర్దమైంది. ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయితే అశ్వనీదత్ నిర్మించాలనే ప్రపోజల్ ఉంది. అయితే మహేష్ ఎంతకీ విషయం తేల్చకపోవటంతో వారు షాహిద్ కపూర్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.
వీరిద్దరూ కలిసి గతంలో 99, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ చిత్రాలు డైరక్ట్ చేసారు. అలాగే డి ఫర్ దోపిడి అనే చిత్రం నిర్మించారు. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. మహేష్ బాబుతో తెలుగులో డైరక్టర్ గా లాంచ్ కానున్నారని, ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తారని అఫీషియల్ గానే వార్తలు వచ్చాయి. అశ్వనీదత్ సైతం ఈ చిత్రం విషయమై మాట్లాడారు.
అప్పట్లో అశ్వనీదత్ మాట్లాడుతూ.... ''మహేష్తో ఇది మా మూడో చిత్రం. 2014 ప్రధమార్ధంలో సినిమాని ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. మహేష్బాబు శైలి, ఇమేజ్కి తగిన కథ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతాము''అన్నారు. వైజయంతి మూవీస్ సంస్థ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అయితే ఇప్పుడు అసలా ఊసే లేకుండా పోయింది.
ప్రస్తుతం వారు హ్యాపీ ఎండింగ్ అనే చిత్రం చేస్తున్నారు. ఇలియానా,సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. హ్యాపీ ఎండింగ్ ప్రాజెక్టు పూర్తి కాగానే షాహిద్ కపూర్ సినిమా ప్రారంభమవుతుంది.