Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరోసారి ఆ దర్శకుడితోనే సిట్టింగ్ వేసిన మహేష్.. ప్రాజెక్ట్ లోకి దిల్ రాజు కూడా..
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ చూస్తుంటే రాజమౌళి కంటే ముందే మరో సినిమాను పూర్తి చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇప్పటికే సర్కారు వారి పాట యొక్క స్పీడ్ ను గట్టిగానే పెంచాడు. ఒక షెడ్యూల్ పూర్తవ్వడంతో వెంటనే మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే మహేష్ వచ్చే ఏడాది రాజమౌళి సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే.
అయితే ఆ లోపే తొందరగా మరో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ దర్శకులతో చర్చలు కూడా జరిపినట్లు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మరొక కొత్త రూమర్ కూడా తెరపైకి వచ్చింది. మహర్షి దర్శకుడైన వంశీ పైడిపల్లితో కూడా మరోసారి చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. మహేష్ ఒప్పుకుంటే దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఆ ప్రాజెక్ట్ తెరపైకి వస్తుందట.
రాజమౌళి RRR పూర్తి చేసిన తరువాత మహేష్ బాబు సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ కానున్నాడట. అందుకు నాలుగు నుంచి 5 నెలల సమయం పట్టవచ్చు. అందుకే మహేష్ వీలైనంత త్వరగా సర్కారు వారి పాటను ఫినిష్ చేసి ఒక కమర్షియల్ సినిమాను తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడని టాక్ వస్తోంది. అందుకు సంబంధించిన రూమర్స్ కూడా చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక SVP సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.