Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మహేష్ కాదన్నదానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఓ హీరో కాదన్న పాత్రను మరో హీరో చేయటం సినీ పరిశ్రమలో చాలా సార్లు జరుగుతూంటుంది. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకో, స్టార్ డమ్ అడ్డొచ్చో, కథ నచ్చకో, తమ పాత్ర నచ్చకో చాలా సార్లు హీరో వాటిని సున్నితంగా రిజెక్టు చేస్తూంటారు. వాటిని మరో హీరో మహదానందంగా భుజాన ఎత్తుకుంటూంటాడు. తాజాగా అటువంటి సంఘటన ఒకటి జరిగిందని సమాచారం. మహేష్ బాబు రిజెక్టు చేసిన గెస్ట్ రోల్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే వచ్చే నెల రెండవ వారంలో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఆ పాత్ర గోన గన్నారెడ్డి అని తెలుస్తోంది. ఆ పాత్రను గతంలో ఎన్టీఆర్ హీరోగా ప్లాన్ చేసారు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే ఆ పాత్ర మీద మమకారంతో ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు సమాచారం.
కాకతీయుల వైభవాన్ని, తెలుగుజాతి పౌరుషాన్నీ చరిత్రలో నిలచిపోయేవిధంగా మా చిత్రంలో చూపించబోతున్నాం అంటున్నారు గుణశేఖర్. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. భారతదేశపు తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి చిత్రమిది. అనుష్క ప్రధాన పాత్రధారి. రానా, నిత్య మీనన్, కేథరిన్ ప్రధాన పాత్రధారులు. హైదరాబాద్ చిత్రీకరణ జరుగుతోంది. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి తీర్చిదిద్దిన రాజదర్బార్ సెట్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన సామంత రాజులతో రుద్రమదేవి మాట్లాడి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 5 వరకూ సాగే ఈ షెడ్యూలులో అనుష్క, రానా, సుమన్, కృష్ణంరాజు, హంసానందినిలతో పాటు కీలక తారాగణం అంతా పాల్గొంటారు.
ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.
తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'