Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ కన్ఫర్మ్ చేసిన నెక్ట్స్ రెండు ప్రాజెక్టులు ఇవే
హైదరాబాద్: మహేష్ బాబు తన తాజా చిత్రం '1, నేనొక్కడినే' ప్రమోషన్ లో ఉంటూ...మరో ప్రక్క తన నెక్ట్స్ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి కొరటాల శివ,యు టీవి చిత్రం. ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ ప్రారంభమైపోయింది. త్వరలోనే అఫీషియల్ గా ఓపినింగ్ జరగనుంది. ఆగడు షూటింగ్ పూర్తియిన వెంటనే ఈ చిత్రం పట్టాలు ఎక్కుతుంది.
అలాగే త్రివిక్రమ్,మహేష్ దర్శకత్వంలో మరో చిత్రం ఓకే అయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి చిత్రం అంటూ వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని తేలింది. ప్రస్తుతం మహేష్ ...ఆగడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
''శ్రీను వైట్ల దర్శకత్వంలో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'దూకుడు'కి ఏ మాత్రం తగ్గదు...ఈ 'ఆగడు'' అంటున్నారు మహేష్ బాబు. మహేష్బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది.
దర్శకుడు చెబుతూ ''పూర్తి వాణిజ్య విలువలతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహేష్ పాత్ర చిత్రణ కొత్తగా అనిపిస్తుంది''అన్నారు. ''దూకుడు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ అందుకొంటుంది''అని నిర్మాతలు చెప్పారు.ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసిన వేసవి కానుకగా సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. సంక్రాంతికి 'నేనొక్కడినే' అంటూ ప్రేక్షకుల్ని పలుకరించాడు మహేష్బాబు. ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ అయిపోయాడు. హైదరాబాద్, గుజరాత్లలో చిత్రీకరణ జరుపుతారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.