Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్,కొరటాల శివ చిత్రం టైటిల్
హైదరాబాద్: మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్. అక్టోబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రం టైటిల్ గురించి రకరకాలు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ మగాడు అని ఖరారు చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లోనే ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బ్యాంకాక్లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా కొరటాల శివ ఈచిత్రాన్ని తెరకెక్కించనుండటంతో ఈ టైటిల్ పరిశీలిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు. మహేష్ బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. ఆగడు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు ఆ మధ్యన జరిగిన మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేక పోయారు. అయితే ఆయన లేని లోటును భర్తీ చేసేందుకు మహేష్ భార్య నమ్రత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమే స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఆమెతో పాటు మహేష్ బాబు బావ స్వరూప్ కూడా హాజరయ్యారు.