Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
వైరల్ అవుతున్న స్టోరీ: మహేష్ బాబుకు రష్మిక మందన్న ఫ్యామిలీ టార్చర్?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 26వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న జరిగింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్.
'సరిలేరు నీకెవ్వరు' టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే మొదలు కాబోతోంది. 2020 సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్గా కనిపించబోతున్నారు.
‘సరిలేరు నీకెవ్వరు' స్టోరీ ఇదే అంటూ...
‘సరిలేరు నీకెవ్వరు' స్టోరీ ఇదే అంటూ తాజాగా ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. వెంకటేష్ మూవీ ‘వారసుడొచ్చాడు', మహేష్ బాబు ‘అతడు' స్టోరీని పోలినట్లుగా ఇది ఉండటం గమనార్హం. ఆర్మీ ఆఫీసర్గా, మిలటరీలో పని చేసే తన స్నేహితుడి కుటుంబానికి సహాయం చేసే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని, అనిల్ రావిపూడి సినిమాల తరహాలో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్.
విజయశాంతి పాత్ర అదేనా?
లీకైనట్లుగా చెబుతున్న కథ ప్రకారం... ఈ చిత్రంలో మహేష్ బాబు ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతోందట. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని, నిర్మాత బండ్ల గణేష్ఒక ఫన్నీలో నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రష్మిక మందన్న మహేష్ బాబుకు ప్రియురాలి పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తోందట.
మహేష్ బాబుకు రష్మిక మందన్న ఫ్యామిలీ టార్చర్?
ఈ చిత్రంలో మహేష్ బాబును రష్మిక మందన్న ఫ్యామిలీ టార్చర్ పెడుతుందని.... ఆ కారణాలు ఏమిటనేది ఆసక్తికరంగా తెరపై చూపించబోతున్నారని, సినిమాలో హైలెట్ అయ్యే అంశాల్లో ఇదీ ఒకటని తెలుస్తోంది. ఈ లీకైన కథలో నిజం ఎంత? అనే విషయంలో త్వరలో ఓ క్లారిటీ రానుంది.
సరిలేరు నీకెవ్వరు
‘సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఎకె ఎంటర్టెన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో నిర్మాణం అవుతోంది. మహేష్ బాబు ఆర్మీ బ్యాగ్రౌండ్ కథలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.