Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
ప్లాన్ మార్చిన మహేష్ బాబు.. మునుపెన్నడూ లేని విధంగా అలా !
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు ఏడాది గడుస్తోంది. ఆయన నుంచి మరో సినిమా రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతి దాకా ఎదురు చూడాల్సిందే అని అంటున్నారు.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న మహేష్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా రిలాక్స్డ్ మోడ్లో సినిమాలు చేస్తారు. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలనే తొందర లేకుండా ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా మొదలు పెడతారు.
అంతే కాకా సినిమా సినిమాకు మధ్య సెలవులు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆయన తన ప్రణాళికలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఒకేసారి ఒకే ప్రాజెక్టుపై ఎక్కువగా దృష్టి సారించే మహేష్ ఇప్పుడు రెండు సినిమాలకు ఒకే సారి చిత్రాలకు పని చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో షూటింగ్ జరిపారు. రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో చేయాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముందు ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాలని అనుకున్నా ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్ లు ఒకే సారి చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాలు రిలీజ్ చేసి దాదాపు ఏడాదిన్నర పైగా అవుతున్న కారణంగా ఫ్యాన్స్ ని ఎక్కడ నిరాశ పరచకుండా రెండు సినిమాలు ఆరు నెలల గ్యాప్ తోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.