Don't Miss!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
తీవ్ర నిరాశలో మహేశ్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ
'మహర్షి' సినిమా ఫలితంతో సంతృప్తిగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్నే సొంతం చేసుకున్నప్పటికీ, విజయవంతంగానే ప్రదర్శితమైంది. 200 పైగా థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు రూ. వంద కోట్లు పైనే కలెక్షన్లను రాబట్టింది.
దీంతో మహేశ్తో పాటు చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది. చాలా రోజుల తర్వాత మహేశ్కు ఇంత భారీ హిట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ సైతం సంబరపడిపోతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం సూపర్స్టార్ మహేశ్ బాబు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఏదీ పట్టుమని నెలరోజులు కూడా థియేటర్లలో ఉండడం లేదు. అలాంటిది 'మహర్షి' మాత్రం 211 థియేటర్లలో యాభై రోజులు జరుపుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా యాభై రోజుల వేడుకను ఘనంగా నిర్వహించాలని భావించింది. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ చేసింది. అయితే, అదే సమయంలో కృష్ణ సతీమణి, ప్రముఖ సినీ సెలెబ్రిటీ విజయనిర్మల మరణించడంతో ఇది కాస్తా ఆగిపోయింది.
ఆ తర్వాత మరోసారి దానిని ప్లాన్ చేయాలని మహేశ్ భావించినప్పటికీ పరిస్థితులు అనకూలించలేదని తెలుస్తోంది. మామూలుగా అయితే ఫంక్షన్ చేద్దామనుకున్నారట. కానీ, ఇటీవల ఈ సినిమా అమేజాన్ ప్రైమ్లో విడుదలైంది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం యాభై రోజులు పూర్తయిన తర్వాతనే ఈ సినిమాను అమేజాన్లోకి తీసుకొచ్చారు. అసలే ఫంక్షన్ వాయిదా పడిందని బాధపడుతున్న ప్రిన్స్కు ఇది మరింత బాధను మిగిల్చిందని వినికిడి.
యాభై రోజుల ఫంక్షన్ జరగకపోవడమేమో కానీ, సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఓ విషయంలో సంతోషంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తమ అభిమాన హీరో సినిమా అమేజాన్లో అందుబాటులోకి రావడమే వారి ఆనందానికి కారణం అని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
'మహర్షి'ని స్టైలిష్ డైరెక్టర్ వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా, అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాతో తన అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారని చెప్పిన మహేశ్.. కొద్దిరోజుల క్రితం జరిగిన సక్సెస్ మీట్లో అదే పని చేసి చూపించాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.