Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తీవ్ర నిరాశలో మహేశ్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ
'మహర్షి' సినిమా ఫలితంతో సంతృప్తిగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్నే సొంతం చేసుకున్నప్పటికీ, విజయవంతంగానే ప్రదర్శితమైంది. 200 పైగా థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు రూ. వంద కోట్లు పైనే కలెక్షన్లను రాబట్టింది.
దీంతో మహేశ్తో పాటు చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది. చాలా రోజుల తర్వాత మహేశ్కు ఇంత భారీ హిట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ సైతం సంబరపడిపోతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం సూపర్స్టార్ మహేశ్ బాబు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఏదీ పట్టుమని నెలరోజులు కూడా థియేటర్లలో ఉండడం లేదు. అలాంటిది 'మహర్షి' మాత్రం 211 థియేటర్లలో యాభై రోజులు జరుపుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా యాభై రోజుల వేడుకను ఘనంగా నిర్వహించాలని భావించింది. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ చేసింది. అయితే, అదే సమయంలో కృష్ణ సతీమణి, ప్రముఖ సినీ సెలెబ్రిటీ విజయనిర్మల మరణించడంతో ఇది కాస్తా ఆగిపోయింది.
ఆ తర్వాత మరోసారి దానిని ప్లాన్ చేయాలని మహేశ్ భావించినప్పటికీ పరిస్థితులు అనకూలించలేదని తెలుస్తోంది. మామూలుగా అయితే ఫంక్షన్ చేద్దామనుకున్నారట. కానీ, ఇటీవల ఈ సినిమా అమేజాన్ ప్రైమ్లో విడుదలైంది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం యాభై రోజులు పూర్తయిన తర్వాతనే ఈ సినిమాను అమేజాన్లోకి తీసుకొచ్చారు. అసలే ఫంక్షన్ వాయిదా పడిందని బాధపడుతున్న ప్రిన్స్కు ఇది మరింత బాధను మిగిల్చిందని వినికిడి.
యాభై రోజుల ఫంక్షన్ జరగకపోవడమేమో కానీ, సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఓ విషయంలో సంతోషంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తమ అభిమాన హీరో సినిమా అమేజాన్లో అందుబాటులోకి రావడమే వారి ఆనందానికి కారణం అని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
'మహర్షి'ని స్టైలిష్ డైరెక్టర్ వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా, అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాతో తన అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారని చెప్పిన మహేశ్.. కొద్దిరోజుల క్రితం జరిగిన సక్సెస్ మీట్లో అదే పని చేసి చూపించాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.