మగధీర కోసం ఎంతకైనా తెగిస్తానంటున్న మహేష్!
ప్రిన్స్ మహేష్ బాబు సినిమా వచ్చి సుమరా రెండేళ్యయింది. మంచి కథ ఉన్న చిత్రం తన చెంతకు రాకపోవడంతో చాలా వరకూ విరామం తీసుకున్న మహేష్, ప్రస్తుతం త్రివిక్రమ్ రూపొందిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు చిత్రం అనగానే ప్రేక్షకులు భారీ అంచనాలు వేస్తారు. ఇదే విషయం మహేష్ కూడా చెబుతున్నాడు. అందుకే వేసవికి తన అభిమానులకు చిత్రాన్ని అందించాలని ఎంతో ఆరాటపడుతున్నాడని సమాచారం.
మగధీర లాంటి కథతో వస్తే ఎంత బడ్జెట్ అయినా స్వయంగా తానే నిర్మిస్తానని, మంచి డైరక్టర్ కూడా కావాలని కూడా మహేష్ తెలుపుతున్నాడు..ఈ విషయం తెలుసుకున్న చాలా మంది కథలతో మహేష్ బాబు చుట్టూ చేరారని సమాచారం. దీన్ని బట్టి మహేష్ బాబు మంచి హిట్ కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. డబ్బు సంపాదించ వచ్చు కానీ ఆ డబ్బు ఎవరి ద్వారా వచ్చిందో వారిని మాత్రం మర్చిపోకూడదు..అంటూఇదంతా తన అభిమానుల కోసం మాత్రమే అని చెప్పడం తనలోని విజ్ఝతను తెలియపరుస్తుంది.


Click it and Unblock the Notifications











