Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు భయపడే వద్దంటున్నాడు
మహేష్ బాబు తన తాజా చిత్రం దూకుడు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతున్నట్లుంది.మరో ప్రక్క మీడియాలో ఈ చిత్రం పోకిరి రికార్డులు బ్రద్దలు కొడుతుందని,మగధీరని ఒంటిచేత్తో ప్రక్కన పడేస్తుందని ప్రచారం చేస్తూండటంతో మహేష్ కంగారుపడుతున్నాడు.అనవసరమైన హైప్ వల్లే శక్తి,బద్రీనాధ్ చిత్రాలు బోల్తాపడ్డాయని,వేరే సినిమాలతో జరుగుతున్న సినిమా పోల్చటం సరికాదని అంటున్నాడు.అలాగే తన నిర్మాతలకు కూడా కంగారుపడి మార్కెట్ కోసం కంటిన్యూ ఇంటర్వూలు ఇచ్చి హైప్ క్రియేట్ చేస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడవల్సివస్తుందని హెచ్చరిస్తున్నట్లు సమచారం.
మరో ప్రక్క దూకుడు ఆడియో అంతగా క్లిక్ కాకపోవటం కూడా మహేష్ ని ఆలోచనలో పడేసింది.ఖలేజా పరాజయం ఆయన్ని ఇప్పటికీ వెంబడిస్తోంది.మగధీర,పోకిరి వంటి రికార్డులు ముందుగా చెప్పి రావని,వాటంతట అవే ప్రేక్షకాదరణ బట్టి క్రియేట్ అవుతాయని అంటున్నాడు.ఇక ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్, సాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, మాస్టర్ భరత్, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, రచన: గోపి మోహన్, కోన వెంకట్, సమర్పణ: జి.రమేష్బాబు.