వారణాసి తర్వాత మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో కాంబో ఫిక్సయితే విధ్వంసమే!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు కూడా కొత్త దిశలో అడుగులు వేస్తున్నారు. అలా ఎవరూ ఊహించని క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతున్నాయి. ఇంతవరకూ వినని కథలు తెరకెక్కతున్నాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి ఇండస్ట్రీ షేక్ చేసేలా మరో కాంబో సెట్ కాబోతుందట. అదే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తరువాత ఎన్టీఆర్ డైరెక్టర్ తో చేతులు కలుపబోతున్నారట. ఈ కాంబో సెట్ అయితే మాత్రం విధ్వంసమే.

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు ఒక ఊహించని క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. కాంబో ఏదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఈ కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీకి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ముగిశాయని, ఇరు వైపుల నుండి సానుకూల స్పందన రావడంతో స్టోరీ డెలవల్ మొదలైనట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Mahesh Babu s Next After Varanasi

అయితే, ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ అప్ కమింగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచరస్ డ్రామా 'వారణాసి' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' మూవీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా అనంతరం నీల్, ప్రభాస్‌తో 'సలార్ 2'ను పట్టాలెక్కించాల్సి ఉంది. ఈ భారీ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ఒకవేళ ఈ క్రేజీ కాంబో గనుక పట్టాలెక్కితే బాక్సాఫీస్ వద్ద నయా హిస్టరీ క్రియేట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్‌ఫుల్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్సులకు.. సూపర్ స్టార్ మహేష్ బాబు అల్టిమేట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్టింగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం అనే చెప్పాలి. సరికొత్త పంథాలో సాగే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ గురించిన వార్త బయటకు వచ్చినప్పటి నుంచే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డుల వేట మొదలంటూ లెక్కలు వేసుకుంటున్నారట.

అయితే, ప్రస్తుతం వీరిద్దరూ చేతిలో ఉన్న హై-బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా, ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌కు చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి అటు మహేష్ బాబు టీమ్ గానీ, ఇటు ప్రశాంత్ నీల్ టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా ఈ ఇద్దరి కలయికలో సినిమా రాబోతుందనే క్రేజీ న్యూస్ మాత్రం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X