Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వచ్చే ఏప్రియల్ నుంచి కొత్త చిత్రానికి మహేష్ డేట్స్
హైదరాబాద్ : ప్రస్తుతం '1' (నేనొక్కడినే) లో బిజీగా ఉన్న మహేష్...ఇటీవలే 'ఆగడు' కూడా మొదలెట్టేసారు. మరో ప్రక్క రీసెంట్ గా కృష్ణ నిడిమోరు, రాజ్ డి.కె. దర్శకత్వం వహించే చిత్రం స్టోరీ లైన్ ని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆ చిత్రానికి ఏప్రియల్ 2014 నుంచి డేట్స్ ఇస్తారని ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ దర్శక ద్వయం నిర్మించిన తమ తాజా చిత్రం డి ఫర్ దోపిడి చిత్రం రిలీజ్ హడావిడిలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి గతంలో 99, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ చిత్రాలు డైరక్ట్ చేసారు. మహేష్ బాబుతో తెలుగులో డైరక్టర్ గా లాంచ్ కానున్నారు. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తారు.
వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన 'రాజకుమారుడు' చిత్రం ద్వారానే మహేష్ హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'సైనికుడు' లాంటి భారీ చిత్రాన్ని కూడా మహేష్ తో నిర్మించారు అశ్వనీదత్. ప్రస్తుతం ప్లాప్ లతో చతికిల పడ్డ వైజయంతీ మూవీస్ బేనర్లో మహేష్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ ఈ బ్యానర్ లో నటించనున్న మూడో సినిమా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ కి వెళ్లనుందని సమాచారం. కృష్ణ నిడిమోరు, రాజ్ డి.కె. దర్శకత్వం వహిస్తారు. సి.అశ్వనీదత్ నిర్మాత.
అశ్వనీదత్ మాట్లాడుతూ.... ''మహేష్తో ఇది మా మూడో చిత్రం. 2014 ప్రధమార్ధంలో సినిమాని ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. మహేష్బాబు శైలి, ఇమేజ్కి తగిన కథ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతాము''అన్నారు. వైజయంతి మూవీస్ సంస్థ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.