Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే మహేషే బెటర్...
'కొమరం పులి" ప్లాపయితే తనవంతుగా నిర్మాతకి అండగా నిలిచేందుకు ప్రమోషన్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. ఈ సినిమాకి అనే కాదు, పవన్ తాను నటించిన ఏ సినిమాకీ పబ్లిసిటీ చేయడు. అయితే 'కొమరం పులి" నిర్మాత నిర్మాణంలో ఎదుర్కొన్నానని కష్టాలు ఇంతదాకా ఎరరూ ఎక్స్ పీరియన్స్ చేసి ఉండరు. ఏ కారణాల వల్ల సినిమా ఆలస్యమై ఉన్నా పవన్ ని తప్పుబట్టడానికి లేదు కానీ తన సొంత కారణాలతో పులి నిర్మాణం ఆలస్యమవడానికి పవన్ కారకుడయ్యాడు. అయినా కానీ పులిని ప్రమోట్ చేసి నిర్మాత శింగనమల రమేష్ ని సపోర్ట్ చేయడానికి పవన్ ముందుకు రాలేదు.
అయితే అదే నిర్మాత నిర్మించిన 'ఖలేజా"కి మాత్రం హీరో తరపు నుంచి సహాయ నిరాకరణ ఎదురుకావడం లేదు. 'ఖలేజా" చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మహేష్ మీడియా ముందుకి వస్తున్నాడు. ఖలేజా అంచనాలను అందుకోలేదన్నది స్పష్టమయినా కానీ తనవంతుగా అభిమానులకి, నిర్మాతకి ఉత్సాహం తగ్గపోకుండా మహేష్ చూసుకుంటున్నాడు. ఓ విధంగా నిర్మాత శింగనమల రమేష్ కి ఇది పెద్ద బూస్ట్ అవుతుందనాలి. సాక్షాత్తూ హీరో వచ్చి ప్రమోట్ చేయడం వల్ల ఏ సినిమాకైనా ఎంతోకొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే 'ఖలేజా" కూడా బాక్సాఫీస్ వద్ద పట్టు కోల్పోకుండా ఉండడానికి మహేష్ పబ్లిసిటీ హెల్స్ అవుతుందనాలి. అందుకే పవన్ కళ్యాణ్ కంటే మహేష్ బెటరని శింగనమల రమేష్ చెప్తున్నాడట.