Don't Miss!
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్-కొరటాల శివ ప్రాజెక్టు నిర్మాతలు మారారు
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి UTV మోషన్ పిక్చర్స్ వారు నిర్మాతలనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. UTV వారు సైతం అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చి త్వరలో ప్రాజెక్టు ప్రారంభమవుతుందనుకున్న సమయంలో నిర్మాతలు మారారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మైత్రి మూవిస్ వారు నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. మైత్రీ మూవీస్ వారు యుఎస్ బేస్ ఉన్న ఎన్నారై గ్రూప్. వారు రీసెంట్ గా ఓవర్ సీస్ లో రెండు పెద్ద చిత్రాలను పంపిణీ చేసారు. UTV ఎందుకు తప్పుకుందనేది కారణం తెలియదు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన ఏమీ లేదు.
అయితే యు.టి.వి సౌత్ డివిజన్ హెడ్ అయిన ధనంజయన్ గోవింద్ ఈ విషయమై డేట్స్ ఖరారు చేసి కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆయన ట్వీట్ చేసిన దాన్ని బట్టి జూలై 14 నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వారంలో మిగతా ఆర్టిస్టులు,టెక్నీషియన్స్ ఎవరెవరు అనేది తెలియచేస్తామన్నారు.
అతిధి తరువాత ఈ సంస్థ మహేష్ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా గతఏడాది ఖరారయినా కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. యూటీవీ మోషన్ పిక్చర్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'మిర్చి'తో ఆకట్టుకొన్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
మరో ప్రక్క 'ఆగడు' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్బాబు. అయితే మే నాటికి చిత్రంలో మేజర్ పోర్షన్స్ షూటింగ్ ఫినిష్ అవనున్నాయి. మే లో కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆగడుకు కేటాయిస్తాడని,మిగతా డేట్స్ కొరటాల శివ వే అని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం.