Don't Miss!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మహేష్ బాబు- పూరి-చిరు ఖైదీ షురూ..?
చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ఖైదీని...మహేష్ బాబు హీరోగా రీమేక్ చేయబోతున్నాను అంటూ ఇటీవల పూరి జగన్నాథ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్, నేను గత మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాం అని కూడా వెల్లడించారు.
ప్రస్తుతం మహేష్-పూరి కాంబినేషన్ లో బిజినెస్ మ్యాన్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఇంకా పూర్తి కానేలేదు..మరో సినిమాకు తెర వెనక సన్నాహాలు మొదలు పెట్టారు ఈ పోకిరి కాంబినేషన్. బిజినెస్ మ్యాన్ షూటింగ్ అయిన వెంటనే దీన్ని మొదలు పెట్టేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా....ఈ సినిమా చిరంజీవి ఖైదీ రీమేకే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగక్ నుంచి. అయితే పూరి మాత్రం ఈ విషయాన్ని నిర్దారించలేదు.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఆ సినిమా ఖైదీ సినిమానా? కాదా? అనే విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.
అప్పట్లో వచ్చిన ఖైదీ సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న చిరంజీవికి అప్పటి నుంచి దిశ తిరిగి పోయింది. స్టార్లందరినీ వెనక్కి తోసి మెగాస్టార్ గా నెం.1 స్థానంలో తిష్టవేశాడు. ఆ సినిమా రీమేక్ లో నటిస్తే తాను కూడా టాలీవుడ్ నెం.1 పొజిషన్ లోకి వెళతానని సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నాడట మహేష్ బాబు.