twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ బడ్జెట్ తో డార్లింగ్ సినిమా ..

    |

    డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు . రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే ఈ సినిమాలో డార్లింగ్ తో రొమాన్స్ చేయనుంది. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత మహానటిఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం . ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడి తో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .

    దశాబ్దాల క్రితం నాటి కథతో దర్శకుడు ఓం రౌత్ ఈ కథను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ప్రతినాయకుడిగా అంటే లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.'తానాజీ' సినిమాతో తానేంటో నిరూపించుకున్న ఓం రౌత్.. 'ఆదిపురుష్' ని నెక్స్ట్ లెవెల్ లో ఆవిష్కరించనున్నాడట.

    Makers Allot Massive Budget For Adi Purush

    ఈ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండటం వల్ల భారతీయ చిత్రాలలో ఇంతకు ముందెన్నడూ చూడని టెక్నిక్ ని తీసుకురాబోతున్నారట. ఇందుకోసం సినిమాకు రూ. 350 - రూ.400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    English summary
    The makers announced 'Adi Purush' which is going to be made on a whopping budget of Rs 400 Crores, The makers are targeting the audience with graphics oriented film bigger than Bahubali and Director Om Raut has impressed audience with Tanhaji acing the graphics in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X