Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
'సీటీమార్' ప్లాన్ రివర్స్.. ప్లాన్ బీతో ముందుకు.. ఆయన ఫుల్ హ్యాపీ!
తెలుగు హీరోలలో గోపీచంద్ స్టైల్ వేరు. మ్యాచో స్టార్ అనే బిరుదు తెచ్చుకున్న ఈ హీరో ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్టు ఒక్కటి కూడా కట్టలేక పోతున్నాడు. చివరిగా 2014లో లౌక్యం అనే సినిమాతో గోపీచంద్ హిట్ కొట్టాడు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ దాదాపు ఏడెనిమిది సినిమాలు చేశాడు.. కానీ ఒక్క సినిమా కూడా ఆయనకు లక్ తీసుకురాలేదు..
క్రీడా నేపథ్యంలో
ఇక ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆయన ఇంతకుముందు చేసిన సీటీమార్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్స్ గా నటించారు.. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా నటించాడు. అలాగే తమన్నా సైతం తెలంగాణ లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా నటించింది.. ఇక దిగంగన సూర్యవంశి ఒక రిపోర్టర్ పాత్రలో నటించింది.
రిలీజ్ కి అదే అడ్డంకి
నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ముందు ఒక సారి వాయిదా పడింది. ఆ తరువాత రిలీజ్ చేయాలని భావించినా కరోనా కారణంగా రిలీజ్ చేయలేని పరిస్థితి. అయితే క్యాన్సిల్ చేయడానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే కారణం అని యూనిట్ ప్రకటించినా అసలు విషయం వేరే ఉందట. గోపీచంద్ మార్కెట్ కంటే ఎక్కువగా నిర్మాత సినిమా కోసం ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.. అందుకే థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆయన విస్తుపోయే రేట్లు చెప్పడంతో థియేట్రికల్ బిజినెస్ జరగలేదట.
ఫుల్ హ్యాపీస్
దీంతో నిర్మాత నిరాశ చెంది సినిమా రిలీజ్ చేయకుండా ఆపినట్లు సమాచారం. అయితే డిజిటల్ రైట్స్ విషయంలో మాత్రం ఆయన ఇటీవల చర్చలు జరపగా ఆ విషయంలో ఫుల్ హ్యాపీ అని తెలుస్తోంది. అందుకే నేరుగా థియేటర్లో రిలీజ్ చేయకుండా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మరి థియేట్రికల్ రైట్స్ విషయంలో రాని అమౌంట్ కేవలం ఓటీటీకి లభిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి అమ్ముకుంటారు. కానీ అలా చేయడం వల్ల పెద్దగా అమౌంట్ రాదని అంటున్నారు.
ఎక్స్క్లూజివ్ కంటెంట్
ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది కాబట్టి అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కాదని, చెబుతూ తక్కువ మొత్తంలోనే ఆ రైట్స్ దక్కించుకుంటాయట ఓటీటీ సంస్థలు. కానీ నేరుగా డిజిటల్ రిలీజ్ చేసే పక్షంలో మాత్రం అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కిందకు వస్తుంది కాబట్టి భారీ రేట్లు వెచ్చించి కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయని తెలుస్తోంది. అలా ఈ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Recommended Video
ప్లాన్ బీ
థియేట్రికల్ రిలీజ్ విషయంలో దెబ్బ పడడంతో ఆ ప్లాన్ పక్కనపెట్టి ప్లాన్ బీతో వెళ్లిన నిర్మాతకు అది బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోందట. మరి చూడాలి ఈ సినిమా నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తారో లేక థియేట్రికల్ రిలీజ్ చేసి తర్వాత డిజిటల్ రిలీజ్ చేస్తారో అనేది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.. ఆయన గతంలో సమంతతో యూటర్న్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.