Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'సీటీమార్' ప్లాన్ రివర్స్.. ప్లాన్ బీతో ముందుకు.. ఆయన ఫుల్ హ్యాపీ!
తెలుగు హీరోలలో గోపీచంద్ స్టైల్ వేరు. మ్యాచో స్టార్ అనే బిరుదు తెచ్చుకున్న ఈ హీరో ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్టు ఒక్కటి కూడా కట్టలేక పోతున్నాడు. చివరిగా 2014లో లౌక్యం అనే సినిమాతో గోపీచంద్ హిట్ కొట్టాడు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ దాదాపు ఏడెనిమిది సినిమాలు చేశాడు.. కానీ ఒక్క సినిమా కూడా ఆయనకు లక్ తీసుకురాలేదు..
క్రీడా నేపథ్యంలో
ఇక ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆయన ఇంతకుముందు చేసిన సీటీమార్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్స్ గా నటించారు.. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా నటించాడు. అలాగే తమన్నా సైతం తెలంగాణ లేడీస్ కబడ్డీ జట్టు కోచ్ గా నటించింది.. ఇక దిగంగన సూర్యవంశి ఒక రిపోర్టర్ పాత్రలో నటించింది.
రిలీజ్ కి అదే అడ్డంకి
నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ముందు ఒక సారి వాయిదా పడింది. ఆ తరువాత రిలీజ్ చేయాలని భావించినా కరోనా కారణంగా రిలీజ్ చేయలేని పరిస్థితి. అయితే క్యాన్సిల్ చేయడానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే కారణం అని యూనిట్ ప్రకటించినా అసలు విషయం వేరే ఉందట. గోపీచంద్ మార్కెట్ కంటే ఎక్కువగా నిర్మాత సినిమా కోసం ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.. అందుకే థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆయన విస్తుపోయే రేట్లు చెప్పడంతో థియేట్రికల్ బిజినెస్ జరగలేదట.
ఫుల్ హ్యాపీస్
దీంతో నిర్మాత నిరాశ చెంది సినిమా రిలీజ్ చేయకుండా ఆపినట్లు సమాచారం. అయితే డిజిటల్ రైట్స్ విషయంలో మాత్రం ఆయన ఇటీవల చర్చలు జరపగా ఆ విషయంలో ఫుల్ హ్యాపీ అని తెలుస్తోంది. అందుకే నేరుగా థియేటర్లో రిలీజ్ చేయకుండా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మరి థియేట్రికల్ రైట్స్ విషయంలో రాని అమౌంట్ కేవలం ఓటీటీకి లభిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి అమ్ముకుంటారు. కానీ అలా చేయడం వల్ల పెద్దగా అమౌంట్ రాదని అంటున్నారు.
ఎక్స్క్లూజివ్ కంటెంట్
ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది కాబట్టి అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కాదని, చెబుతూ తక్కువ మొత్తంలోనే ఆ రైట్స్ దక్కించుకుంటాయట ఓటీటీ సంస్థలు. కానీ నేరుగా డిజిటల్ రిలీజ్ చేసే పక్షంలో మాత్రం అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కిందకు వస్తుంది కాబట్టి భారీ రేట్లు వెచ్చించి కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయని తెలుస్తోంది. అలా ఈ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Recommended Video
ప్లాన్ బీ
థియేట్రికల్ రిలీజ్ విషయంలో దెబ్బ పడడంతో ఆ ప్లాన్ పక్కనపెట్టి ప్లాన్ బీతో వెళ్లిన నిర్మాతకు అది బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోందట. మరి చూడాలి ఈ సినిమా నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తారో లేక థియేట్రికల్ రిలీజ్ చేసి తర్వాత డిజిటల్ రిలీజ్ చేస్తారో అనేది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.. ఆయన గతంలో సమంతతో యూటర్న్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.