Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
నాగార్జున,రవితేజ,నాని,తాప్సీ కలిసి స్టెప్స్
హైదరాబాద్: నాగార్జున, రవితేజ,రానా, నాని, సుశాంత్, శింబు, తాప్సీ అందరూ కలిసి ఒకే పాటలో కనిపించనున్నారా...అవుననే అంటున్నారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘దొంగాట'. ఈ సినిమాలో ఓ పాటలో తెలుగు స్టార్ హీరోలలో కొందరు స్టెప్పులు వేయనున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.
నాగార్జున, రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేయనున్నారు. ‘దొంగాట' సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెప్తుంది. సాధారణంగా హిందీలో ఎక్కువ ఈ తరహ ట్రెండ్ కనిపిస్తుంది. మన తెలుగులో మొదలవడం సంతోషించదగ్గ అంశం అంటున్నారు.
మంచు లక్ష్మి, అడవి శేష్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వంశీకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఓ వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి దొంగాట అన్న టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ట్విట్టర్లో తెలిపింది.
కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేశారు. మిగతా షూటింగ్ జరగాల్సి వుంది. ఇందులోని ఓ కీలకమైన అతిధి పాత్రలో రానా కనిపించబోతున్నారు. కథలో తన పాత్రకున్న ప్రాధాన్యతను గుర్తించి రానా ఇందులో నటించడానికి అంగీకరించారని, పాత్ర చిన్నదే అయినా చిత్ర కథను మలుపు తిప్పుతుందని, అందుకే ఆయన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకోవడం జరిగిందని చిత్ర వర్గాలు తెలిపాయి.
మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలో సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.