Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మణిరత్నం ‘లజ్జో’ ముగ్గురు హీరోలతో?
ఈ చిత్రం కోసం తొలుత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్తో సంప్రదింపులు జరిపిన మణిరత్నం....తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని ముగ్గురు కథానాయకులతో ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెన్నై టాక్. తన ద్వారా వెండితెరకు పరిచయమైన మాధవన్, అరవింద స్వామి, గౌతమ్ కార్తీక్లతో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట.
ఇక ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం అందరికీ తెలిసిందే. భారత్-పాకిస్తాన్ విడిపోయిన సందర్భాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, దానికి కాస్త ప్రేమకథను కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సంచలన చిత్రాలను తెరకెక్కించే మణిరత్నం కథకు ఇప్పుడు ఈ అంశమే ముడిసరకుగా మారినట్లు సమాచారం.
ఈ మధ్య వచ్చిన మణిరత్నం సినిమాలేవీ ప్రేక్షకులకు రుచించడం లేదు. రావణ్, కడలి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడటమే కాదు...భారీగా నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మణి తాజా సినిమా ఎలాంటి ఫలాతాలను ఇస్తుందో అనే చర్చమొదలైంది.