twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం ‘లజ్జో’ ముగ్గురు హీరోలతో?

    By Bojja Kumar
    |

    Mani Ratnam
    చెన్నై : 'కడలి' చిత్రంతో భారీ అపజయాన్ని చవి చూసిన దర్శకుడు మణిరత్నం మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఇండో-పాక్‌ సంబంధాలు నేపథ్యంగా దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినా...'లజ్జో' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    ఈ చిత్రం కోసం తొలుత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో సంప్రదింపులు జరిపిన మణిరత్నం....తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని ముగ్గురు కథానాయకులతో ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెన్నై టాక్. తన ద్వారా వెండితెరకు పరిచయమైన మాధవన్, అరవింద స్వామి, గౌతమ్ కార్తీక్‌లతో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట.

    ఇక ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం అందరికీ తెలిసిందే. భారత్‌-పాకిస్తాన్‌ విడిపోయిన సందర్భాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, దానికి కాస్త ప్రేమకథను కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సంచలన చిత్రాలను తెరకెక్కించే మణిరత్నం కథకు ఇప్పుడు ఈ అంశమే ముడిసరకుగా మారినట్లు సమాచారం.

    ఈ మధ్య వచ్చిన మణిరత్నం సినిమాలేవీ ప్రేక్షకులకు రుచించడం లేదు. రావణ్, కడలి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడటమే కాదు...భారీగా నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మణి తాజా సినిమా ఎలాంటి ఫలాతాలను ఇస్తుందో అనే చర్చమొదలైంది.

    English summary
    We already reported you that Mani Ratnam's next after Kadal might feature Gautham Karthik. Now the latest is that the director is penning a script which might have Arvind Swamy,Madhavan and Gautham Karthik in the lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X